ఈరోజుల్లో చిత్రంతో ఓవర్నైట్ స్టార్ అయిపోయిన రేష్మరాథోడ్ రాజకీయాలపై మక్కువ చూపిస్తున్నారు.' రేష్మ రాథోడ్ బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.కారేపల్లి మండలం భాగ్యనగర్తండాకు చెందిన మాజీ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాధాబాయి రాథోడ్ కుమార్తె రేష్మరాథోడ్.
ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. వరంగల్ -ఖమ్మం మధ్య ప్రాంతాల్లో సింగరేణి ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటుంది. రేష్మను వైరా అసెంబ్లీ లేదా మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్టు సమచారం. రేష్మను రంగంలోకి దింపితే ఎస్టీల ఓట్లను పొందవచ్చన్న ఆలోచనలో ఉన్న బీజేపీ, ఈ విషయంలో ఆమెను సంప్రదించినట్టు తెలిసింది. గిరిజన యువతి కావడం, ఈ ప్రాంతంలో సమీప బంధువులు ఉండటం, స్వస్థలం కావడం, సినిమా హీరోయిన్ గా ఉన్న గుర్తింపు ఆమెకు ప్లస్ పాయింట్స్ అవుతాయన్నది బీజేపీ ఆలోచనగా ఉంది.
గత ఎన్నికల్లో పాలమూరు స్థానం నుంచి ప్రొఫెసర్ సీతారాం గెలుపొందారు. ఈనేపథ్యంలో ఎస్టీ ఓట్లను పొందేందుకు రేష్మను బీజేపీ రంగంలోకి దించేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం.