ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్లో తొలి రోజు నుంచే భారత్ ఖాతాలో బంగారు పతకాలు చేరాయి.
భారత బంగారు పతక విజేతలు :
6వ రోజు ఏషియాడ్ టెన్నిస్ మెన్స్ డబుల్స్ లో రోహన్ బోపన్న,దివిజ్ శరణ్ స్వర్ణ పతకం నెగ్గారు.
6వ రోజు మెన్స్ క్వాడ్రాపుల్ స్కల్స్ రోయింగ్లో భారత్కు దత్తు బాబన్,ఓమ్ ప్రకాష్,సుఖ్మీత్ సింగ్,సవర్ణ్ సింగ్ స్వర్ణ పతకం అందించారు.
5వ రోజు మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్లో రాహి సర్నోబత్ స్వర్ణ పతకం నెగ్గింది.
3వ రోజు 10 మీ ఎయిర్ పిస్టల్ షూటింగ్లో 16 ఏళ్ల సౌరభ్ చౌదరి స్వర్ణ పతకం నెగ్గాడు.
2వ రోజు మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్లో వినేష్ ఫోగట్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది.
తొలిరోజు పురుషుల 65 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్లో బజ్రంగ్ పూనియా స్వర్ణం సాధించాడు.