ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. చిన్న పిల్లల నుంచి వితంతువుల వరకు చాలా మంది మోదీకి రాఖీ కట్టారు. ఈశాన్య రాష్ర్టాల ఆడపడుచులు రాఖీలు కట్టి స్వీట్లు అందించారు. చిన్నారులకు మోదీ ఆటోగ్రాఫ్లు ఇచ్చారు. దేశ ప్రజలకు మోదీ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన మోదీ.. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.