పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

     Written by : smtv Desk | Sat, Sep 01, 2018, 12:31 PM

 పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి రికార్డు స్థాయిలో పెరిగుదల నమోదు చేశాయి.. ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి పతనమవడంతో దేశీయ మార్కెట్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాజధాని అమరావతిలో శుక్రవారం లీటరు పెట్రోల్‌ ధర రూ. 84.84, డీజిల్‌ రూ. 77.64గా నమోదైంది. గతమూడు నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించని చమురు మార్కెటింగ్‌ సంస్థలు ఇప్పుడు రూపాయి పతనం పేరుతో ధరలను పెంచుకుంటూ పోతున్నాయి

దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం లీటర్ పెట్రోల్‌ ధర 16 పైసలు పెరిగి రూ. 78.68గా ఉంది. లీటర్‌ డీజిల్ ధర 21 పైసలు పెరిగి రూ. 70.42గా ఉంది. లీటర్ పెట్రోల్‌ ధర ముంబైలో రూ. 86.09, కోల్‌కతాలో రూ. 81.60, చెన్నైలోని 81.72గా ఉంది.





Untitled Document
Advertisements