కొండగట్టు మృతులకు రూ . 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా

     Written by : smtv Desk | Tue, Sep 11, 2018, 02:11 PM

కొండగట్టు మృతులకు రూ . 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా

* క్షతగాత్రులకు మెరుగైన వైద్యం ప్రభుత్వమే అందిస్తుంది
* ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డుప్రమాదంలో 24 మంది మరణించగా 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యయి. మృతులకు రూ . 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
గాయపడ్డవారికి ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందిస్తుందని అన్నారు. ఈ ప్రమాదంలో 24 మంది మృతదేహాలను ఇప్పటి వరకు వెలికితీశారు. మెరుగైన వైద్యం కోసం జగిత్యాలతో పాటు హైదరాబాద్‌కు క్షతగాత్రులను తరలించారు.





Untitled Document
Advertisements