వంశీ పైడిపల్లి దర్శకత్వం లో మహేష్ బాబు 25 చిత్రంగా వస్తున్న చిత్రం 'మహర్షి' సినిమాకి అనుకోని ఆటంకం ఎదురైంది, ఇరవై అయిదు రోజుల షూటింగ్ కోసం ప్రస్తుతం అమెరికాకు వెళ్లనున్న యూనిట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రయాణాన్నిరద్దు చేయడం జరిగింది, తిరిగి మళ్ళి అక్టోబర్ నెలలో ఈ షెడ్యుల్ ని కొనసాగించనున్నారు అని సమాచారం. ఇప్పటికే రెండు షెడ్యుల్ లను డెహ్రాడూన్ లో పూర్తి చేశారు.
దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుండగా అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు, ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకి రానుంది.