హైదరాబాద్: ట్విట్టర్ వేదికగా నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఏపి సీఎం చంద్రబాబు పై వ్యంగాస్త్రాన్ని సందించారు. 'తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, చంద్రబాబుకు బాబ్లీ గుర్తుకురావడం వండర్ గా అనిపిస్తోంది' అని మరియు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నసమయంలోనే చంద్రబాబుపై కేసు రిజిస్టర్ అయిందని ఈరోజు 'న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' దినపత్రికలో వచ్చిన కథనాన్ని జోడిస్తూ అన్నారు. 'స్కాంగ్రెస్' తో పొత్తు పెట్టుకుని బాబ్లీని వాడుకుంటున్నారు, ''బాబ్లీ డ్రామా - నాన్ బెయిలబుల్ వారెంట్' మంచి విశ్లేషణ" అని ఆమె వ్యాఖ్యానించారు.