హైదరాబాద్: కాపు సామాజిక వర్గ బడా పారిశ్రామిక వేత్తల నుంచి జనసేన పార్టీ డబ్బులు వసూలు చేస్తోందని తన స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా అది నిరుపిస్తానని మహా ఛానల్ జర్నలిస్ట్ మూర్తి చేసిన హడావుడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 'మహా న్యూస్' సైతం ఈ ప్రసారాలను నిలిపివేయడం తో భరించలేక పోయిన మూర్తి తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసాడు, ఈ తరుణం లో విమర్శలపై పవన్ ఏ విదంగా స్పందిస్తాడా అని జనం ఎదురు చూస్తున్న సందర్బం లో... జనసేన పార్టీ అధికార ప్రతినిధి విజయ్ బాబు మాట్లాడుతూ పార్టీ అన్నాక తిట్లు - పొగడ్తలు సహజమని చెప్పారు, స్టింగ్ ఆపరేషన్ గురించి ఈ విషయంలో జనసేన పార్టీ అధికారికంగా స్పందించదని స్పష్టం చేశారు. పాపులారిటి కోసమే జర్నలిస్ట్ మూర్తి ఈ విధంగా చేసారని, మేము ఎవ్వరి నుండి అక్రమంగా డబ్బులు తీసుకోలేదని అన్ని పార్టీలలాగానే విరాళం తీసుకున్నామని వివరించారు. పవన్ మాత్రం పార్టీ సభ్యులు నిర్వహించిన అంతర్గత సమావేశం లో మూర్తి వ్యాఖ్యలను పట్టించుకోవద్దని కార్యకర్తలు కూడా ఈ విషయం పై ఎటువంటి వివాదాలు కొనితేవద్దని రహస్యంగా స్పందించారని వినికిడి.