తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ ఉద్యోగాల తుది రాత పరీక్ష కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 40 పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో 966 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సివిల్, తదితర విభాగాల్లో 16,925 పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్షకు సుమారు 4.5 లక్షల మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలుస్తోంది.