చినజీయర్ స్వామి ఆశీర్వాదం పొందిన సీఎం చంద్రశేఖర్ రావు

     Written by : smtv Desk | Sun, Nov 11, 2018, 05:15 PM

చినజీయర్ స్వామి ఆశీర్వాదం పొందిన సీఎం చంద్రశేఖర్ రావు

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ఆనవాయితీని ఈసారి కూడా కొనసాగించారు. గత ఎన్నికలకు ముందు ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామిని దర్శించుకుని ఆయన ఆశీసులు పొందిన విషయం తెలిసిందే. ఈసారి కూడా కేసీఆర్ చినజీయర్‌ స్వామి ఆశీస్సులను తీసుకున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం నుంచి రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొనాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో స్వామిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని ఆశ్రమాన్ని ఎంపీ సంతోష్‌ కుమార్‌తో కలిసి సందర్శించారు. అక్కడ జరిగిన హోమంలో పాల్గొన్నారు. అనంతరం చినజీయర్‌ స్వామి కేసీఆర్‌ను ఆశీర్వదించారు.





Untitled Document
Advertisements