పేటీఎం ద్వారా ఎల్‌ఐసీ ప్రీమియం

     Written by : smtv Desk | Wed, Nov 21, 2018, 06:14 PM

పేటీఎం ద్వారా ఎల్‌ఐసీ ప్రీమియం

డిజిటల్ వాలెట్ సేవల సంస్థ పేటీఎం ద్వారా కూడా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు. ఈ మేరకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనను విడుదల చేసింది. పేటీఎం సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే భారతదేశంలో దాదాపు 30 జీవిత బీమా సంస్థలు ప్రీమియం చెల్లింపుల కోసం పేటీఎం సేవలు తీసుకుంటున్నాయి. తాజాగా.. ఆ జాబితాలోకి ఎల్ఐసీ కూడా చేరింది.

ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరిందని పేటీఎం సీవోవో కిరణ్ వాసిరెడ్డి తెలిపారు. ఇప్పటికే పేటీఎం ద్వారా దాదాపు 30 కంపెనీలు ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లిస్తున్నాయని, తాజాగా ఎల్‌ఐసీ సంస్థకు కూడా ప్రీమియంలను చెల్లించవచ్చని పేటీఎం సీవోవో అన్నారు.





Untitled Document
Advertisements