భోపాల్, నవంబర్ 23: : మధ్యప్రదేశ్లోని సత్నాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది . బస్సు-పాఠశాల వ్యాను ఢీకొన్న సంఘటనలో ఏడుగురు విద్యార్ధులతో పాటు వ్యాను డ్రైవరు మృతి చెందారు. ఈ నేపథ్యంలో మరో 12 మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. విద్యార్ధులు బిర్సింగ్పూర్లోని లక్కీ కాన్వెంట్ స్కూల్కు చెందినవారు. దుర్ఘటన ఎంతో విచారకరమన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. తగిన సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.