అంటిగ్వా, నవంబర్ 23: మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీం ఇండియాకు ఓటమి తప్పలేదు. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని బరిలోకి దిగిన హర్మన్ప్రీత్ సేనకు.. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. ముందుగా ఆ జట్టు బౌలర్లు భారత్ను తక్కువ పరుగులకే కట్టడి చేయగా, తరువాత బ్యాట్స్వుమెన్ జోన్స్(51; 42బంతుల్లో 3ు4, 1ు6), నటైలి (54; 43బంతుల్లో 5ు4) రాణించడంతో ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది.
అంతకుముందు బ్యాటింగ్కు భారత్ 19.3ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధాన(34; 23బంతుల్లో 5ు4, 1ు6), రోడ్రిగ్స్(26; 26బంతుల్లో 3ు4) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత్ చివర్లో 23 పరుగులకే ఎనిమిది వికెట్లు చేజార్చుకుంది.