ముగిసిన ఎన్నికల ప్రచారం....!

     Written by : smtv Desk | Wed, Dec 05, 2018, 06:43 PM

ముగిసిన ఎన్నికల ప్రచారం....!

హైదరాబాద్‌, డిసెంబర్ 5: తెలంగాణలో ఎన్నికల ప్రచార గడువు ఈ సాయంత్రం 5గంటలతో ముగియడంతో ప్రచారానికి తెరపడింది. ఈరోజు సాయంత్రం 5గంటల తర్వాత బహిరంగ సభల నిర్వహణపై, ఊరేగింపులు, సినిమా, టీవీల ద్వారా ప్రచారంపై నిషేధం విధించారు. ఈ నెల 7న 119 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్‌ నిర్వహణ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. డిసెంబర్ 7న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ సాయంత్రం 4గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసింది.

* ఈ ఎన్నికల బరిలో మొత్తం 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
* రాష్ట్రవ్యాప్తంగా 32815 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
* అత్యధికంగా హైదరాబాద్‌లో 3873 పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేశారు.
* అత్యల్పంగా వనపర్తిలో 280 పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేశారు.
* ఎన్నికల విధుల కోసం 1,60,509 మంది సిబ్బందిని కేటాయించారు.
* ఎన్నికల కోసం 55,329 బ్యాలెట్‌ యూనిట్లు, 42,751 వీవీప్యాట్‌ యంత్రాలు, 39,763 కంట్రోల్‌ యూనిట్లను వినియోగిస్తున్నారు.
* ఎన్నికల విధుల్లో 649 మంది సహాయక రిటర్నింగ్‌ అధికారులు ఉంటారు.
* ఎన్నికల విధుల కోసం 279 మంది కేంద్ర కంపెనీల బలగాలు రాష్ట్రంలో మోహరించనున్నాయి.
* 30వేల మంది రాష్ట్ర భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు.
* రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెలువడనున్నాయి.





Untitled Document
Advertisements