హైదరాబాద్, డిసెంబర్ 10: సంచలనం రేపిన మద్దెలచెర్వు సూరి హత్య కేసులో రేపు హైదరాబాద్ నాంపెల్లి కోర్టు తీర్పు చెప్పనుంది . ఈ కేసులో భానుకిరణే రివాల్వర్ తో సూరి ని చంపాడని అభియోగాలు దాఖలు అయ్యాయి , ఈ నేపథ్యం లో భాను కిరణ్ పై శిక్ష పడుతుందా అనే విషయానికి రేపు తెర పడనుంది.
2011 జనవరి 3వ తేదీన మద్దెలచెర్వు సూరిని హత్య చేసిన తర్వాత పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. ఢిల్లీ నుంచి ముంబై మీదుగా హైదరాబాద్ వస్తుండగా జహీరాబాద్ సమీపంలో భాను కిరణ్ను పోలీసులు అరెస్టు చేసారు
ఆర్థిక లావాదేవీల కారణంగానే భాను సూరిని హత్య చేసినట్లు తెలుస్తోంది. సూరి భాను కిరణ్ను తీవ్రంగా వేధించాడని, దాన్ని తట్టుకోలేక భాను సూరిని హత్య చేశాడని చెబుతూ వస్తున్నారు.