హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస పార్టీ విజయాల పరంపరలో భాగంగా సిద్ధిపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేత హరీశ్ రావు 80,000 ఓట్ల భారీ మెజార్టీతో పట్నం నరేందర్ రెడ్డిపై ఘనవిజయం సాధించారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 13 నియోజకవర్గాల్లో విజయ డంకా మోగించింది. తాజా ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 74 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 18, బీజేపీ 2,టీడీపీ 2, మజ్లిస్ 4, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.