కేసీఆర్ దమ్ముంటే ఏపీలో ప్రచారం చేయ్ : ఏపీ మంత్రి

     Written by : smtv Desk | Thu, Dec 13, 2018, 06:14 PM

కేసీఆర్ దమ్ముంటే ఏపీలో ప్రచారం చేయ్ : ఏపీ మంత్రి

అమరావతి, డిసెంబర్ 13: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ లో కూడా అడుగుపెడతా, విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడతా అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఏపీ మంత్రి నక్కా ఆనందబాబుస్పందించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కు దమ్ముంటే ఏపీలో ప్రచారం చేయామని సవాల్ విసిరారు. వైసీపీతో కెసిఆర్ పొత్తుపెట్టుకున్నారు అని అన్నారు. కేసీఆర్ కోసమే తెలంగాణలో వైసీపీ పోటీ చేయలేదని విమర్శించారు.

వైసీపీ, బీజేపీ, జనసేన, ఎంఐఎంలను కేసీఆర్ నడిపిస్తున్నారని ఆరోపించారు. ఏపీలోని విపక్షాలు కేసీఆర్ తో ఎలా కలుస్తాయో చూస్తామని అన్నారు. డబ్బుతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ కు అభినందనలు తెలుపుతున్నామని చెప్పారు.





Untitled Document
Advertisements