అరుదైన రికార్డు చేసి స్వర్ణాన్ని సొంత చేసుకున్న సింధు

     Written by : smtv Desk | Thu, Dec 20, 2018, 11:49 AM

అరుదైన రికార్డు చేసి స్వర్ణాన్ని సొంత చేసుకున్న సింధు

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 20: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు అరుదైన రికార్డు సాధించి టోర్నీలో స్వర్ణంను సాధించింది. ఈ ఫీట్ అందుకున్న తొలి భారత షట్లర్‌గా అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఫైనల్లో జపాన్ షట్లర్ నోజొమి వొకుహరపై 21-19, 21-17 తేడాతో రెండు వరుస సెట్లతో సింధు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.

గత సంవత్సరం ఫైనల్లో తనకు ఎదురైన పరాభవానికి సింధు ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ విజయం అంత సులువుగా ఏమీ రాలేదు. రెండు వరుస సెట్లలో తీవ్రంగా శ్రమించి వొకుహరపై విజయాన్ని అందుకుంది. 73 షాట్లు ఆడిన సింధు చివరకు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.





Untitled Document
Advertisements