ప్రతి ఉద్యోగికి సోంత ఇల్లు : ఏపీ సీఎం

     Written by : smtv Desk | Sat, Jan 05, 2019, 07:24 PM

ప్రతి ఉద్యోగికి సోంత ఇల్లు : ఏపీ సీఎం

అమరావతి, జనవరి 5: ఈ రోజు జన్మభూమి కార్యక్రమంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లు, నోడల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు.. సొంత ఇల్లు లేని ప్రతి ఉద్యోగికి ఇల్లు కల్పించి వారి కలలను నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవల ద్వారా ప్రజా సేవచేసే ప్రతి ఉద్యోగికి సొంత ఇల్లు ఉండాలని ఆయన చెప్పారు. ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి భూములు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అపార్ట్‌మెంట్లు నిర్మించి అందులో వారికి ప్లాట్లు కేటాయించాలని సూచించారు. రాష్ట్ర ప్రగతికి ప్రజలు, ఉద్యోగులే రథాలు అని ముఖ్యమంత్రి కొనియాడారు. ఇరువర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేకం చేశామని గుర్తుచేశారు. 30, 40 ఏళ్లు హైదరాబాద్‌తో అనుబంధం వదులుకుని ఉద్యోగులు, న్యాయవాదులు ఇక్కడికి వచ్చినందున వారు నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.





Untitled Document
Advertisements