జగన్ కేసుపై రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం...!!!

     Written by : smtv Desk | Mon, Jan 07, 2019, 12:24 PM

జగన్ కేసుపై రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం...!!!

అమరావతి, జనవరి 7: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ కోడికత్తి దాడి కేసును తాజాగా ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాక కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం తెలియజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ విషయంపై కేంద్ర హోంమంత్రికి నిరసన వ్యక్తం చేస్తూ లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర హోంమంత్రి స్వయంగా కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తే బాగుంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. లేఖలో ప్రస్తావించాల్సిన అంశాలపై తగిన నివేదిక ఇవ్వాలని చంద్రబాబు పోలీస్ అధికారులను, న్యాయనిపుణులను కోరారు. జగన్‌పై దాడి కేసు ఎన్ఐఏకి అప్పగించిన విషయంపై చంద్రబాబు అడ్వొకేట్ జనరల్ తోనూ డిజీపితోనూ చర్చించిన తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.





Untitled Document
Advertisements