ప్రముఖ సినీ నటుడు భానుచందర్ వైసీపీ లో చేరిక ...

     Written by : smtv Desk | Wed, Jan 09, 2019, 04:14 PM

ప్రముఖ సినీ నటుడు భానుచందర్ వైసీపీ లో చేరిక ...

శ్రీకాకుళం, జనవరి 9 : ప్రజాసంకల్ప యాత్ర చివరి రోజున వైసీపీ అధినేత జగన్ ను కలిసిన ప్రముఖ సినీ నటుడు భానుచందర్ వైసీపీలో చేరారు.... వైసీపీ చీఫ్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా భానుచందర్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం భానుచందర్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పార్టీ అప్పజెప్పే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.





Untitled Document
Advertisements