తిరుపతి, జనవరి 10: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన తన ప్రజాసంకల్ప యాత్ర బుధవారం ఇచ్చాపురంలో ముగిసిన విషయం తెలిసిందే. అయితే మరుసటి రోజు తిరుపతికి కాలి నడకన వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ రోజు ఉదయం తిరుపతికి పయనమయ్యారు జగన్. విజయనగరం నుంచి రైల్లో బయల్దేరి ఈ రోజు ఉదయం రేనిగుంటకు చేరుకోనున్నారు. తర్వాత రోడ్డు మార్గాన 11 గంటలకల్లా తిరుపతి పద్మావతీ అతిధి గృహం చేరి కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు బయల్దేరి కాలినడకన తిరుమలకు బయల్దేరుతారు.
కాసేపట్లో రేణిగుంట చేరుకోనున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి రోడ్డు మార్గాన తిరుపతికి పయనం. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల వెళ్లనున్న వైయస్ జగన్. #YSRCP #YSJagan #Tirumala
— YSR Congress Party (@YSRCParty) January 10, 2019
సామాన్య భక్తులు వెళ్లే మార్గంలో శ్రీవారిని దర్శించుకోనున్న వైయస్ జగన్. స్వామివారి దర్శనం అనంతరం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందునున్న వైయస్ జగన్.#YSRCP #YSJagan #Tirumala
— YSR Congress Party (@YSRCParty) January 10, 2019