ఎయిర్ టెల్ కు జియో దెబ్బ.

     Written by : smtv Desk | Sun, Feb 03, 2019, 03:38 PM

ఎయిర్ టెల్ కు జియో దెబ్బ.

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1: భారతదేశంలోనే అతి పెద్ద టెలికాం సంస్థ ఎయిర్ టెల్ నెమ్మదిగా తన స్థానాన్ని కోల్పోతుంది. జియో కారణంగా ఎయిర్ టెల్ కస్టమర్ల సంఖ్య తగ్గుతూ వస్తుంది. తాజాగా వెల్లడించిన డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో ఎయిర్ టెల్ భారీ సంఖ్యలో వినియోగదారులను కోల్పోయిందని తేలింది. డిసెంబర్ లో ఏకంగా 5.7 కోట్ల మంది వినియోగదారులను ఆ సంస్థ కోల్పోయింది. దీంతో నవంబర్ లో 34.1 కోట్ల మంది మొబైల్ వినియోగదారులతో ప్రత్యర్థి కంపెనీలకు అందనంత దూరంలో ఉన్న ఎయిర్ టెల్ కష్టమర్ బేస్ డిసెంబర్ చివరి నాటికి 28.42కోట్లకు పడిపోయింది.

దీంతో ప్రస్తుతం ఎయిర్ టెల్, జియో కంటే 42 లక్షలు ఎక్కువ వినియోగదారులను కలిగి ఉంది. డిసెంబర్ చివరి నాటికి జియో వినియోగదారుల సంఖ్య 28కోట్లు. రిలయన్స్ అందించే ఆఫర్లు, టారిఫ్ లు చాలా ఆకర్షణీయంగా ఉండడం వల్ల త్వరలోనే జియో ఎయిర్ టెల్ దాటేసే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements