ముంబై , ఫిబ్రవరి 06: అతి తక్కువ ధరలకే టెలికాం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించింది ప్రముఖ సంస్థ రిలయన్స్ జియో.. తక్కువ కాలంలో కోట్లాది వినియోగదారులను సొంతం చేసుకుంది ఆ సంస్థ . ఎక్కువ స్పీడ్ ఉన్న 4జీ సేవలను అందిస్తున్న జియో త్వరలోనే 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కాదు, 5జీతో పనిచేసే మొబైల్ను విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తునట్టు స్థానిక సమాచారం. 5జీ సేవలను వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అందుబాటులోకి తీసుకురావాలని జియో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. స్పెక్ట్రాం వేలం పూర్తయిన ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా పనులు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో సొంత 5జీ ఫోన్లను కూడా సిద్ధం చేస్తోంది. అదే సమయంలో 5జీ ఆధారంగా పనిచేసే ఫీచర్ఫోనూ తీసుకురావాలని జియో ఆలోచిస్తుందట.