న్యూఢిల్లీ , ఫిబ్రవరి 06: దేశీయ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మెటల్స్, ఐటీ సూచీలు ముఖ్యంగా బాగా లాభపడ్డాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 358 పాయింట్లు లాభపడి 36,975కు పెరిగింది. నిఫ్టీ 128 పాయింట్లు ఎగబాకి 11,062 వద్ద స్థిరపడింది.ఇకపోతే బీఎస్ఈ సెన్సెక్స్ లో బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్ లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ లు స్వల్ప నష్టాలను చవిచూశాయి.