ప్రశాంత్ కిశోర్ జోస్యం: కాబోయే ప్రధాని ఎవరంటే ?

     Written by : smtv Desk | Tue, Feb 12, 2019, 03:34 PM

ప్రశాంత్ కిశోర్ జోస్యం: కాబోయే ప్రధాని ఎవరంటే ?

న్యూఢిల్లీ , ఫిబ్రవరి 12: ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి, మళ్లీ ప్రధాని పీఠం ఎక్కేది నరేంద్ర మోదీనే అని జోస్యం చెప్పారు. కిశోర్ 2014లో మోదీకి వ్యూహకర్తగా పనిచేయడం తెలిసిందే.

గత సంవత్సరం సెప్టెంబరులో జేడీయూలో చేరిన కిశోర్ ఇటీవల ముంబై వెళ్లి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. దీంతో శివసేన, జేడీయూల మధ్య ఏదో జరుగుతోందని వార్తలు వచ్చాయి. దీంతో ఆయన మీడియాకు వివరణ చ్చారు. ‘మా భేటీకి ఎన్నికలతో సంబంధం లేదు.. ’ అని అన్నారు. జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పీఎం రేసులో ఉంటారా అని అడగ్గా .. ఆ అవకాశం లేదంటూ మోదీనే తిరిగి అధికారంలోకి వస్తాడన్నారు. ఎన్డీఏలో నితీశ్ పెద్ద నాయకుడే అయినా, ఆయనను పిఎం రేసులో ఊహించుకోలేమన్నారు. బీజేపీకి సరిపడా బలం లేకపోయినా ఆయనను పిఎం రేసులో భావించలేమన్నారు.





Untitled Document
Advertisements