మళ్ళీ తెరపైకి జగపతిబాబు సూపర్ హిట్ సినిమా

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 09:15 AM

మళ్ళీ తెరపైకి జగపతిబాబు సూపర్ హిట్ సినిమా

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ప్రస్తుతం టాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది. హీరో జగపతిబాబు కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన కుటుంబ కథా చిత్రం 'శుభలగ్నం'. 1994 లో వచ్చిన ఈ సినిమాకి ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమాకి మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఈ సినిమాలో రోజా, ఆమని హీరోయిన్లుగా నటించారు. వీరి నటన అందరిని ఆకట్టుకుంది. ఇదే కథను హిందీలో 'జుదాయి' పేరుతో రీమేక్ చేసారు. అక్కడ కుడా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ని నిర్మించాలనే యోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తుంది.

70 MM ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ 'శుభలగ్నం' సీక్వెల్ ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తుంది. కొత్త దర్శకుడితో ఈ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో కూడా జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తాడని సమాచారం. అయితే ఈ సినిమాలో మిగతా నటీనటులకు సంబంధించి వివరాలు ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే నిర్మాణ సంస్థ సినిమాకి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.





Untitled Document
Advertisements