ఆ హీరో రెండోసారి కుడా రకుల్ నే కావాలనుకుంటున్నాడట!!

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 11:09 AM

ఆ హీరో రెండోసారి కుడా రకుల్ నే కావాలనుకుంటున్నాడట!!

హైదరాబాద్, ఫిబ్రవరి 15: రకుల్ చేతిలో ప్రస్తుతం తెలుగు సినిమాలు లేనప్పటికీ మళ్ళీ తెలుగులో ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె 'వెంకిమామ' సినిమాలో నటిస్తుంది. 'జయ జానకీ నాయక' సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కు సక్సెస్ లభించలేదు. ఇటీవల విడుదలైన 'సాక్ష్యం', 'కవచం' సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో ఈ హీరో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు.

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో 'సీత' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. కాజల్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.

ఈ రెండు సినిమాలతో పాటు ఇంకో సినిమాకి కూడా ఈ యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తమిళ సినిమా 'రాక్షసన్' రీమేక్ లో నటించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తుంది. ఆమెతో ఇంతకు ముందు చేసి 'జయ జానకి నాయక' సినిమా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ అదే హిట్ కాంబోను రిపీట్ చేసే పనిలో బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నాడని సమాచారం. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements