ప్రతీ ఎమ్మెల్యే రూ. 50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ సంపాదించారు: దాసరి జై రమేష్

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 07:13 PM

ప్రతీ ఎమ్మెల్యే రూ. 50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ సంపాదించారు: దాసరి జై రమేష్

అమరావతి, ఫిబ్రవరి 15: ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జై రమేష్ నేడు వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో ఉండి తాను సంపాదించిందేమీ లేదన్న ఆయన.. ఆ పార్టీకి, చంద్రబాబుకు ఎంతో సాయం చేశానన్నారు. జగన్ విలువలు తనకెంతో నచ్చాయనీ.. త్వరలోనే వైసీపీలో చేరుతానన్నారు.

పార్టీ ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తానని జై రమేష్ తెలిపారు. చంద్రబాబు ప్రయత్నం అవినీతిలో కూరుకుపోయిందని.. ఈ ఐదేళ్ల టీడీపీ పాలనలో ప్రతీ ఎమ్మెల్యే రూ. 50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ సంపాదించారని విమర్శించారు. చంద్రబాబు సీఎం కావడానికి కారణం తానేనని.. నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా పార్టీని కాపాడటానికి తన వంతు ప్రయత్నం చేశానని జై రమేష్ పేర్కొన్నారు.





Untitled Document
Advertisements