ఫిబ్రవరి 16: 'శాంసంగ్' ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఉన్న సంస్థ. ఈ సంస్థ అనేక ఎలక్ట్రానిక్ వస్తువులను విడుదల చేసి మంచి ఆదరణ పొందిన సంస్థగా శాంసంగ్ పేరు దక్కించుకుంది. శాంసంగ్ నుండి స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి అధికంగానే ఉంటుంది. ఇక ఇప్పటికే శాంసంగ్ ఎం10, ఎం20, పేరుతో స్మార్ట్ఫోన్లును విడుదల చేసింది.
అయితే త్వరలోనే ఎం30 పేరుతో మరో మోడల్ను స్మార్టఫోన్ వినియోగాదారుల కోసం తీసుకువస్తుంది. ఈనెలలోనే ఈఫోన్ విడుదల అవుతుంది. మార్చి మొదటి వారం నుండి అమ్మకాలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈఫోన్లో ట్రిపుల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, రూ.15వేల ప్రారంభ ధరతో ఎం30ని తీసుకొచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.