హర్యానా, ఫిబ్రవరి 19: హర్యానాలో అసెంబ్లీ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. 2019-20 సంవత్సరానికి గాను ఈనెల 22న ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాలు రేపటి నుంచి మార్చి 5 వరకు రెండు వారాలపాటు జరుగనున్నాయి.
లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రవేశ పెడుతున్న బడ్జెట్ కావడంతో కొత్త పథకాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాడుతామని కాంగ్రెస్ తెలిపింది. బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఐఎన్ఎల్డీ ఆరోపిస్తుంది.