ట్విట్టర్లో కొట్టుకుంటున్న జగన్, లోకేష్...

     Written by : smtv Desk | Tue, Feb 19, 2019, 08:40 PM

ట్విట్టర్లో కొట్టుకుంటున్న జగన్, లోకేష్...

అమరావతి, ఫిబ్రవరి 19: కొండవీడులో రైతు ఆత్మహత్యపై వైసీపీ అధ్యక్షుడు జగన్ అధికార టీడీపీని, సీఎం చంద్రబాబుని టార్గెట్ చేసి నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో దీనిపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. కొండవీడులో రైతు ఆత్మహత్యపై వైఎస్ జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని లోకేశ్ ట్విట్టర్ ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో... 'శవాలపై పేలాలు ఏరుకునే 420 జగన్ మోహన్ రెడ్డి గారు మరోసారి శవరాజకీయం మొదలుపెట్టారు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనుకుని చావు దెబ్బతిన్నా ఆయనకి బుద్ది రాలేదు.'... 'ఇప్పుడు మరోసారి దొంగ పత్రిక, దొంగ రాతలతో శవాన్ని అడ్డుపెట్టుకొని కుల రాజకీయం చెయ్యాలని 420 ఆరాటపడుతున్నారు. కొండవీడులో రైతు కోటయ్యగారు వ్యక్తిగత కారణాలతో చనిపోతే సానుభూతి ప్రకటించాల్సింది పోయి మీ నీచ రాజకీయం కోసం వాడుకోవడమే వైకాపా ఎజెండానా?' ... 'రైతు పొలానికి, ముఖ్యమంత్రి హెలిప్యాడ్ కి సంబంధమే లేదు అన్న విషయం మీ దొంగ పత్రికకు తెలియదా? వైకాపా శవ రాజకీయాల పార్టీ అని మరోసారి రుజువయ్యింది. మీ శవ, కుల రాజకీయాలకు త్వరలోనే ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు' అని ట్వీట్ చేసారు.

కాగా ఆత్మహత్య చేసుకున్న రైతును కాపాడేందుకు పోలీసులు ఎంతో శ్రమించారని అన్నారు. రైతు కోటయ్యను పోలీసులు భుజాలపై ఎత్తుకుని పరుగున వెళ్తున్న వీడియోను అప్ లోడ్ చేసిన లోకేష్ ఈ వీడియో చూస్తే పోలీసులు పడ్డ శ్రమ తెలుస్తోందని అన్నారు. పోలీసులు కష్టాన్ని అభినందించాల్సిందిపోయి స్వార్థ రాజకీయం కోసం పోలీసులపై నిందలు వెయ్యడం అతని శవరాజకీయాలకు నిదర్శనమంటూ లోకేష్ ఆరోపించారు.





Untitled Document
Advertisements