సాయి ధరమ్ 'జవాన్' టీజర్ విడుదల

     Written by : smtv Desk | Mon, Jul 31, 2017, 06:33 PM

సాయి  ధరమ్ 'జవాన్' టీజర్ విడుదల

హైదరాబాద్, జూలై 31 : ''కొంత మంది కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశ భక్తీ అనేది కిరీటం కాదు కృతజ్ఞత'' అంటున్నారు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా 'జవాన్'. ఈ చిత్రం టీజర్ ను ఈ రోజు విడుదల చేశారు. బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేహ్రిన్ కథానాయికగా నటిస్తున్నారు. అరుణాచల్ క్రియేషన్ పతాకంపై క్రిష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. మిలటరీ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సినిమాపై అంచనాలు పెంచే విధంగా టీజర్ ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements