తపస్విని ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు

     Written by : smtv Desk | Fri, Mar 22, 2019, 07:46 PM

తపస్విని ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు

మార్చ్ 22: భువనేశ్వర్‌లోని పూరి స్టేషన్‌లో తాజాగా ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పూరి-హటియా తపస్విని ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే ఈ సమయంలో రైలులో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. మొదట ఎస్‌4 భోగి నుంచి దట్టమైన పొగలు వచ్చి మంటలు అలుముకున్నాయి. ఎస్‌4 భోగి పూర్తిగా కాలిపోగా, ఎస్‌3, ఎస్‌ 5 భోగీలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఫైర్‌ సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కలిసి మంటలను ఆర్పేశారు.





Untitled Document
Advertisements