పాక్‌ నేషనల్‌ డేకు గైర్హాజరు!

     Written by : smtv Desk | Fri, Mar 22, 2019, 07:50 PM

పాక్‌ నేషనల్‌ డేకు గైర్హాజరు!

మార్చ్ 22: ఢిల్లీలోని పాకిస్థాన్‌ మిషన్‌లో ప్రతీ ఏడాది మార్చి 23న పాకిస్థాన్‌ నేషనల్‌ డే వేడుకలను జరుపుకుంటుంది. అయితే ఈసారి ఒకరోజు ముందుగానే జరుపుకోవాలని పాక్ సర్కార్ నిర్ణయించింది. కాగా ఈరోజు జరిగిన పాక్‌ నేషనల్‌ డే వేడుకలకు భారత ప్రభుత్వం తరపున ఏ అధికారి వెళ్ళలేదు. భారత్‌ తరఫున ఒక కేంద్ర మంత్రి ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమానికి కశ్మీర్‌ వేర్పాటువాద నేతలను ఆహ్వానించిడం వల్లే కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.





Untitled Document
Advertisements