అంబులెన్సులో వచ్చి నామినేషన్ వేసిన తిక్కారెడ్ది

     Written by : smtv Desk | Fri, Mar 22, 2019, 08:09 PM

అంబులెన్సులో వచ్చి నామినేషన్ వేసిన తిక్కారెడ్ది

మంత్రాలయం, మార్చ్ 22: ఎన్నికల సందర్భంగా నామినేషన్ వెయ్యడానికి మంత్రాలయం టిడిపి ఆభ్యర్థి తిక్కారెడ్ది అంబులేన్స్‌లో వచ్చాడు. ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో జరిగిన కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్ససొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు నామినేషన్ వేసేందుకు తిక్కారెడ్ది అంబులేన్స్‌లో వచ్చి తన నామపత్రాలను రిటర్పింగ్‌ ఆధికారికి సమర్పించారు. ఇటీవల కార్పూలు జిల్లా మంత్రాలయంలోని ఖగ్గల్లులో ప్రచారం నిర్వహించేందుకు తిక్కారెడ్డి వెళ్లి గ్రామ చావడ సమీపంలో టిడిపి జెండాను ఎగరవేశారు. విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి బాలనాగిరెడ్డి భార్యా జయమ్మ ఆయన కుమారుడు ప్రదీప్‌ రెడ్డి గ్రామస్థులతో కలిపి ఆడ్డుకోవడంతో ఇరు పార్టీల క్యారకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో తిక్కారెడి గన్‌మెన్‌ గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు ఆందులో ఒక బుల్లెట్‌ తిక్కారెడ్డి కాలు లోపలికి దూసుకెళ్లడంతో ఆయనను ఆప్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements