ఫ్రాన్స్, మార్చ్ 23: ఫ్రాన్స్లోని పారిస్లో గత 19 వారాలుగా కొనసాగుతున్న ఎల్లోవెస్ట్ ఉద్యమం నిరసనలు తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా నిరసనకారులు పారిస్ నగరంలో బీభత్సం సృష్టించారు. అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. పారిస్ నగర వీధుల్లోకి వందలాదిగా చేరుకున్న జనం తమ నిరసన తెలిపారు. వీరిని అదుపు చేయడానికి సుమారు 5 వేల మంది పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇదే అదునుగా దొంగలు బ్యాంక్లను, షాపులను లూటీ చేస్తున్నారు.