వరల్డ్ కప్ టోర్నికి శ్రీలంక జట్టు

     Written by : smtv Desk | Thu, Apr 18, 2019, 05:00 PM

వరల్డ్ కప్ టోర్నికి శ్రీలంక జట్టు

్రీలంక: ఇంకొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న ఐసిసి వరల్డ్ కప్ టోర్నీకి శ్రీలంక జట్టును తాజాగా సెలక్టర్లు ప్రకటించారు. కెప్టెన్సీ రేసులో ఉన్న దినేశ్ చండిమాల్, ఉపుల్ తరంగాకి కనీసం జట్టులో చోటు దక్కకపోగా.. 2015 తర్వాత శ్రీలంక తరఫున కనీసం ఒక్క వన్డే మ్యాచ్‌లో కూడా ఆడని దిముత్ కరుణరత్నెకు పగ్గలు అప్పజెప్పారు. సీనియర్‌ లసిత్‌ మలింగను ఎంపిక చేసిన సెలెక్టర్లు.. నిరోషన్ డిక్వెల్లా, అఖిల ధనంజయకు నిరాశే మిగిల్చారు.ఇప్పటికే ఈ టోర్నీకి టీంఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ దేశాల జట్టును ప్రకటించారు.
శ్రీలంక టీం: దిముత్ కరుణరత్నె (కెప్టెన్), ఏంజిలో మాథ్యూస్, తిసార పెరీరా, కుశాల్ పెరీరా, ధనుంజయ డిసిల్వా, కుశాల్ మెండిస్, లసిత్ మలింగ, ఇసురు ఉదాన, మిలింద సిరివర్ధనె, ఫెర్నాండో, జీవన్ మెండిస్, తిరుమానె, జెఫ్రీ వండర్‌సాయ్, నువాన్ ప్రదీప్, లక్మల్.





Untitled Document
Advertisements