వన్‌ప్లస్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 10:15 AM

వన్‌ప్లస్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త

వన్‌ప్లస్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ బ్రాండ్ వన్‌ప్లస్ అతిపెద్ద స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. నిన్న బెంగళూరులో రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రొ ను అవిష్కరించింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. దాంతోపాటు ముంబై, పుణేలలో కూడా రెండు ఎక్స్ పీరియన్స్ స్టోర్లను ప్రారంభించినట్లు ప్రకటించింది.

వన్‌ప్లస్ స్టోర్‌ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌లో 16వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అరంతస్థుల భవనం నిర్మిస్తున్నామని సీఈవో పీట్ లౌ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి అందులో స్టోర్‌ను ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభించినట్లు తెలిపారు.





Untitled Document
Advertisements