ముంభై: పోయిన వారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను చవి చూసిన క్రమంలో బిఎస్ఇలోని టాప్10 కంపెనీల్లో తొమ్మిది కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.82,379.79 కోట్ల మేర పెరిగింది. ఈ నేపథ్యంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహింద్ర బ్యాంక్ లాంటి బ్యాంకింగ్ కౌంటర్లు ప్రధానంగా బాగానే రానించాయి. గత వారంలో బిఎస్ఇ సెన్సెక్స్ 467.78 పాయంట్లు అంటే 1.24 శాతం లాభపడి శుక్రవారం 37,930.77 పాయింట్ల వద్ద ముగిసిన విషయం తెలిసిందే. బిఎస్ఇలో కనిపించిన సానుకూల ధోరణి కారణంగా సెన్సెక్స్లోని టాప్10 కంపెనీల్లో తొమ్మిది కంపెనీలుతమ మార్కెట్ విలువను గణనీయంగా పెంచుకున్నాయి. ఒక్క టిసిఎస్ మార్కెట్ విలువ మాత్రమే తగ్గింది. కాగా లబ్ధి పొందిన కంపెనీల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముందు వరసలో నిలిచింది. మరో వైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.9,635.15 కోట్లు పెరిగి రూ. 8,02,316.11 కోట్లకు చేరుకోగా, ఐటిసి విలువ రూ.4,535.7 కోట్లు పెరిగి రూ.3,69,475.16 కోట్లకు చేరుకుంది.