న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడిన నేపథ్యంలో మోదీ ఆర్ఎస్ఎస్ పెద్దలతో సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది. మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని మోదీ సందర్శించనుండటం గత నాలుగేళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.