కొరియా పర్యటనను భారత మహిళల హాకీ జట్టు ఘనంగా ప్రారంభించింది. మూడు మ్యాచ్ల ఈ ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా సోమవారం జరిగిన తొలి పోరులో భారత్ 2-1 గోల్స్ తేడాతో ఆతిథ్య దక్షిణ కొరియాపై ఘన విజయం సాధించింది. భారత్ తరపున యువ స్ట్రయికర్ లాల్రెమ్సియామి 20వ నిమిషంలో, నవ్నీత్ కౌర్ 40వ నిమిషంలో గోల్ చేశారు. కొరియా జట్టులో షిన్ హెజెయోంగ్ (48వ) గోల్ కొట్టింది. భారత్ తన రెండో మ్యాచ్ను బుధవారం ఆడనుంది.