చెన్నై: భారత మాజీ కాప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ టెరైన్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా తాజాగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకీ రాజగోపాల్ సోమవారం మధ్యాహ్నం చెన్నైలో జరిగిన విలేఖరుల సమావేశంలో అధికారికంగా ప్రకటించారు.పదేళ్లకు ముందు తాంబరంలో ప్రారంభించిన ఇండియన్ టెరైన్ సంస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 150 స్టోర్లలో తమ ఉత్పత్తులు విక్రయించే స్థాయికి ఎదిగిందని తెలిపారు. సంస్థ టర్నోవర్ను మూడేళ్లలో రూ. 650 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, భవిష్యత్లో మరో 150 స్టోర్లలో తమ ఉత్పత్తులను విక్రయించనున్నామని వివరించారు. ఈ సమావేశంలో సంస్థ ఎండీ శరత్నరసింహన్ కూడా పాల్గొన్నారు.