వరంగల్: వరంగల్ జిల్లాలోని ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో జిల్లాస్థాయి గ్రామీణ క్రికెట్ క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ టోర్నమెంట్ను ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదయాకర్ రావు ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర వ్యాయామానికి తోడ్పడుతాయన్నారు. ఆటలో గెలుపోటములు సహజమని.. స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. అదేవిధంగా వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహాకులకు సూచించారు.