కేజ్రీవాల్‌కు నిరాశ

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 10:50 AM

 కేజ్రీవాల్‌కు నిరాశ

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు నిరాశ తప్పేలా కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రంగా కృషి చేసింది. అందుకు తగిన ప్రతిఫలం కనిపిస్తున్నట్టే ఉంది. ఇక్కడ మొత్తం ఏడు స్థానాలు ఉండగా మొత్తం స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ఆధిక్యాన్ని ప్రదర్శించలేకపోతున్నాయి. కాంగ్రెస్‌-ఆప్‌లు చివరి వరకు పొత్తు కోసం ప్రయత్నించి, ఆ తర్వాత విడివిడిగా పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చింది. ఆప్ అభ్యర్థులు మొత్తం వెనకంజలో కొనసాగుతున్నారు.





Untitled Document
Advertisements