ఇండోనేషియాలో అల్లర్లు...ఆరుగురు మృతి

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 12:09 PM

ఇండోనేషియాలో అల్లర్లు...ఆరుగురు మృతి

ఇండోనేషియా: దేశ రాజధాని జకార్తాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే అక్కడ అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఆరుగురు మృతి చెందినట్లు, 200 మంది గాయపడినట్లు ఇండోనేషియా పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. అయితే ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం సాయంత్రం నుంచే దేశ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు కొందరు ఇండోనేషియన్లు. చనిపోయిన ఆరుగురిలో ఇండోనేషియన్ నేషనల్ పోలీస్ ఛీఫ్ టిటో కర్ణవియన్ కూడా ఉన్నట్లు స్థానిక ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఫలితాల తర్వాత చెలరేగిన ఈ అల్లర్లలో సుమారు 60 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.





Untitled Document
Advertisements