కోచింగ్ సెంటర్ లో ఘోర అగ్నిప్రమాదం..పలువురి మృతి!

     Written by : smtv Desk | Fri, May 24, 2019, 06:32 PM

కోచింగ్ సెంటర్ లో ఘోర అగ్నిప్రమాదం..పలువురి మృతి!

గుజరాత్ లోని సూరత్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సర్తానా ప్రాంతంలో ఉన్న ఓ బిల్డింగ్ లోని రెండో అంతస్తులో మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాద ఘటనలో పలువురు మృతి చెందగా, చాలా మందికి గాయాలయ్యాయి. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు బాధితులు ఆ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాల పాలయ్యారు.

మంటలను అదుపు చేసేందుకు 18 అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనపై సూరత్ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ, ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. కాగా, సహాయకచర్యలు ముమ్మరం చేయాలని ఈ మేరకు ప్రధాని మోదీ ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.





Untitled Document
Advertisements