ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ప్రమాణ స్వీకారం రోజు కోసమే ఏపీ శ్రేణులు అంతా ఏంతగానో ఎదురు చూస్తున్నారు.అస్సలు రాష్ట్రంలో ఎవ్వరూ కానీ విని ఎరుగని రీతీలో వార్ వన్ సైడ్ చేసేసి 150 స్థానాలు దక్కించుకున్నారు.దీనితో ప్రముఖ రాజకీయ విశ్లేషకుల నుంచి మరియు రాజకీయ వేత్తల నుంచి ప్రశంసల జల్లు అందుకుంటున్నారు.అయితే తాజాగా ప్రముఖ రాజకీయ వేత్త మరియు మాజీ కాంగ్రెస్ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన ప్రెస్ మీట్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.అసలు ఏపీ లో జగన్ ఎలా గెలిచారో ఎలాంటి కారణాలు జగన్ కు ఈసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అందించాయి క్లుప్తంగా వివరించారు.
జగన్ ముఖ్యమంత్రి కావడానికి తెలుగుదేశం పార్టీ ఎలా కారణమయ్యిందో కూడా తెలిపారు.ప్రజా సమస్యల పట్ల మాట్లాడాల్సిన అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ వారు కావాలనే జగన్ మరియు వైసీపీ శ్రేణులను తొక్కుదామని ప్రయత్నించారని దానితో జగన్ కు చిర్రెత్తుకొచ్చి ప్రజల మధ్యలోకి వచ్చి వారి కష్టాలను తెలుసుకునేందుకు నిర్విరామంగా పాదయాత్ర చేసారని దానితో ఏపీ ప్రజల్లో తెలుగుదేశం పార్టీ అన్నా చంద్రబాబు అన్నా తీవ్ర వ్యతిరేఖత మొదలయ్యిందని అందువల్లనే ఏపీ ప్రజలంతా జగన్ కు 150 స్థానాలు కట్టబెట్టి ఇంతటి భారీ విజయాన్ని అందించారని ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేసారు.