చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షావోమి తాజాగా మరో కొత్త స్మార్ట్ఫోన్ లాంచ్ చేసింది. ఎంఐ 9టీ పేరుతో కంపెనీ యూరోపియన్ మార్కెట్లో ఈ ఫోన్ను ఆవిష్కరించింది. రెడ్మి కే20 ఫోన్కు ఇది రీబ్రాండెడ్ వెర్షన్. త్వరలోనే ఇది ఇండియన్ మార్కెట్లోకి రానుంది. షావోమి ఎంఐ 9టీ ఫోన్లో 6.39 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఆమ్లెడ్ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ/128 జీబీ మెమరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఎంఐ 9టీ ఫోన్లో ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా (48 ఎంపీ+8 ఎంపీ+13 ఎంపీ) ఉంటుంది. ముందు భాగంలో 20 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేస్తుంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫోన్ ధర రూ.25,800 నుంచి ప్రారంభం కావొచ్చు.