కిర్గిస్థాన్ రాజధాని బిష్కేక్ లో 13, 14 తేదీల్లో జరుగునున్న శాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు. అయితే ఈ సమిట్ కు వివిధ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరితో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా సమావేశాల్లో పాల్గొనేందుకు గురువారం బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.